రాయలసీమకు మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు వస్తోంది. ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటార్స్ రాయలసీమలో పెట్టుబడులు పెడుతోంది. చిత్తూరు జిల్లా సత్యవేడు మండలంలో హీరో మోటార్స్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్(జీపీసీ) నిర్మాణానికి సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. అలాగే స్వర్ణాంధ్ర ఫౌండేషన్ ద్వారా హీరో మోటార్స్ అందిస్తున్న "హీరోస్ ఆఫ్ టుమారో" స్కాలర్షిప్లను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత ఏపీ పోలీసుల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఎలక్ట్రిక్ మొబిలిటీ వాహనాలను అందజేస్తారు.