కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి లేఖ రాశారు. కరీంనగర్ పట్టణంలో టీటీడీ ఆధ్వర్యంలో ఆలయం నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఆలయ నిర్మాణానికి 2023లోనే భూమి పూజ జరిగినా.. ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదన్నారు. యుద్ధ ప్రతిపాదికన ఆలయ నిర్మాణం పనులు చేపట్టాలని లేఖలో కోరారు.