Vizag Devotee 1 crore Donation To TTD: తిరుమల శ్రీవారి ఆలయానికి వైజాగ్ భక్తుడు కోటి రూపాయల విరాళం అందజేశారు. మైత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ చైర్మన్ శ్రీనివాసరావు ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు విరాళం సమర్పించారు. మరోవైపు శేషాచల అడవుల్లో తుంబురు తీర్థ ముక్కోటి వైభవంగా జరిగింది, సుమారు 14,500 మంది భక్తులు పాల్గొన్నారు. అలాగే మూడు రోజుల పాటు జరిగిన శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ముగిశాయి, ఈ సందర్భంగా టీటీడీ పలు ఆర్జిత సేవలను రద్దు చేసింది.