టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన మంగళవారం టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, బోర్డు సభ్యులు, ఈవో శ్యామలరావు, ఏఈవో వెంకయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. బెంగళూరులో శ్రీవారి ఆలయం నిర్మించాలని నిర్ణయించారు. అలాగే రేణిగుంట ఎయిర్పోర్టుకు శ్రీవారి పేరు పెట్టాలని టీటీడీ ప్రతిపాదించింది.