తిరుమల తిరుపతి దేవస్థానం విద్యాసంస్థలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దేందుకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం రూ. 118.89 కోట్ల నిధులను కేటాయించి, డిజిటల్ తరగతులు, నూతన హాస్టల్ బ్లాకులు, మౌలిక సదుపాయాలను మెరుగుపరచనున్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో 33 విద్యాసంస్థల్లోని 21,580 మంది విద్యార్థులకు ఆధునిక సాంకేతిక విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధి శిక్షణను అందించడమే లక్ష్యంగా ప్రణాళికలు రెడీ అయ్యాయి.