Grandma danced with joy: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ ఖమ్మంలో జరిగింది. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. ఒక వృద్ధురాలు ఆనందంతో డ్యాన్స్ చేయగా, పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ ధ్యేయమని భట్టి అన్నారు. ప్రతి ఒక్కరికి సొంతింటి కల నెరవేరుస్తామని, గృహప్రవేశానికి ఆహ్వానిస్తే తప్పకుండా వస్తానని ఆయన హామీ ఇచ్చారు. పేదల కష్టాలను చూసే ప్రభుత్వం తమదేనని ఆయన స్పష్టం చేశారు.