మాజీ ముఖ్యమంత్రి జగన్కు నమ్మినబంటు.. అత్యంత సన్నిహితుడిగా విజయసాయి రెడ్డికి గుర్తింపు ఉంది. మాజీ సీఎంకి అన్ని విషయాల్లోనూ ఆయన మద్దతుగా నిలిచారు. అలాంటి ఆయన గత నెలలో రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్టు ప్రకటించడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. పదవీకాలం ఉండగానే ఆయన రాజసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం.. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదవులు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇది ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.