Heavu Rain In Telangana: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుమురం భీం జిల్లా కాగజ్నగర్లో కుండపోత వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయబడిందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు పిడుగుల బారిన పడకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు హెచ్చరించారు.