సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో విషాద వాతావరణంలో సాగే అంతిమయాత్రలు, ఇటీవల కొన్నిచోట్ల విభిన్నంగా మారాయి. మరణించిన వ్యక్తి శవాన్ని పాడిపై ఉంచి, డీజే సౌండ్స్తో నృత్యాలు చేస్తూ ఊరేగింపు సాగుతోంది. బంధువులు, స్నేహితులు ఒకరిని చూసి మరొకరు నృత్యాలు చేస్తుండగా, ఇది చూసిన వారికి నవ్వాలో, ఏడ్వాలో అర్థం కావడం లేదు. ఈ ధోరణిపై సంప్రదాయవాదులు విమర్శలు చేస్తుండగా.. యువతరం మాత్రం దీనిని జీవితాన్ని వేడుకగా భావించి, మరణించిన వారి జ్ఞాపకాలను సంతోషంగా గుర్తుచేసుకోవడంగా చూస్తున్నారు.