విశాఖను సందర్శించాలనుకునేవారికి అదిరిపోయే వార్త. వైజాగ్లో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం డబుల్ డెక్కర్ బస్సులను అందుబాటులోకి తెచ్చింది. సీఎం చంద్రబాబు ఇటీవల రెండు డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించారు. ఈ బస్సులలో పెద్దలు రూ.250, పిల్లలు రూ.100 చెల్లిస్తే 24 గంటలు చెల్లేలా టికెట్ ఇస్తారు. దీని సాయంతో నగరంలోని పర్యాటక ప్రాంతాలను అద్దాల బస్సులో చూస్తూ చుట్టేసే వీలుంది.