ఏపీలో భిన్నమైన వాతావరణం నెలకొంది. కొన్ని జిల్లాలలో ఎండలు, మరికొన్ని జిల్లాలలో వానలతో వాతావరణంలో అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో బుధవారం రోజు (మార్చి18) ఏపీలోని పలు జిల్లాలలో వానలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. పిడుగులు పడేందుకు అవకాశం ఉందని హెచ్చరించింది. వాతావరణంలో నెలకొన్న అనిశ్చితి కారణంగా కోస్తా జిల్లాలలో వచ్చే మూడు, నాలుగు రోజులు ఎండలు కాస్త తగ్గనున్నాయి.