ఏపీవాసులకు బిగ్ అలర్ట్.. రాష్ట్రంలో మరో మూడ్రోజులు వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం మంగళవారం నాటికి అల్పపీడనంగా మారనుంది. ఈ నేపథ్యంలో వచ్చే మూడ్రోజులు ఏపీలో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. మరోవైపు విజయవాడలో వరదలు సంభవించి నేటికి ఏడాది పూర్తి అయ్యింది.. నాటి భయానక పరిస్థితిని బెజవాడ వాసులు మరోసారి గుర్తు చేసుకుంటున్నారు.