Weather Update: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. శనివారం పలు జిల్లాలకు వర్ష సూచన

4 months ago 23
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కొనసాగుతున్నాయి. శనివారం రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాలలో వర్షాలు కురుస్తాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అంచనా వేసింది. తీరం వెంబడి ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. మరోవైపు శని, ఆదివారాలలో ఏపీలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. పిడుగులు పడేందుకు అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Read Entire Article