ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. రాష్ట్రంలో మరో మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వానలు పడతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మత్స్యకారులు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లవద్దని విజ్ఞప్తి చేసింది.