ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అలర్ట్.. రాష్ట్రంలో మళ్లీ వర్షాలు పడనున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. దీని ప్రభావంతో ఆదివారం కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మరోవైపు సెప్టెంబర్ 13న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు భారతీయ వాతావరణ విభాగం తెలిపింది. ఈ నెలాఖరు వరకూ తెలుగు రాష్ట్రాల్లో వానలు పడతాయని అంచనా వేసింది.