ఏపీలో వచ్చే ఐదురోజులు వర్షాలు కురవనున్నాయి. వచ్చే 24 గంటల్లో పలు జిల్లాల్లో వానలు పడనున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఏపీకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు వచ్చే మూడు రోజులు ఏపీలోని కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.