Chenetha Runa Mafi Scheme: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయటమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే.. రైతులకు రూ.2 లక్షల మేర రుణమాఫీ చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు నేతన్నలకు కూడా ఆదుకోవాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే.. రేవంత్ రెడ్డి సర్కార్ భారీ శుభవార్త వినిపించింది. నేతన్న రుణమాఫీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం.. రూ.22 కోట్లు రుణమాఫీ చేస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ ఉత్తర్వులు కూడా జారీ చేసింది.