ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గురువారం నుంచి వాట్సాప్ గవర్నెన్స్ మొదలుపెట్టనుంది. జనవరి 30 నుంచి 161 రకాల పౌర సేవలను వాట్సాప్ ద్వారా అందించనున్నారు. ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ వాట్సాప్ గవర్నెన్స్ సేవలను గురువారం ప్రారంభించనున్నారు. మరోవైపు తొలి విడతలో మున్సిపల్, దేవాదాయ, ఆర్టీసీ, రెవెన్యూ సేవలను అందించనునారు. వాట్సాప్ గవర్నెన్స్ కోసం ఏపీ ప్రభుత్వం వాట్సాప్ నంబర్ను విడుదల చేయనుంది. వాట్సాప్ గవర్నెన్స్ కోసం మెటాతో ఏపీ సర్కారు ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే.