వైసీపీ కార్యకర్తల అత్యుత్సాహం వైఎస్ జగన్కు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. వైఎస్ జగన్ మంగళవారం రాప్తాడులో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వైఎస్ జగన్ను చూసేందుకు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలోనే హెలిప్యాడ్ వద్ద సిబ్బంది వారిని నియంత్రించలేకపోయినట్లు తెలిసింది. దీంతో జనం వైఎస్ జగన్ వచ్చిన హెలికాప్టర్ మీద పడటంతో వైఎస్ హెలికాప్టర్ అద్దం పగిలిపోయింది. ఈ నేపథ్యంలో ఈ హెలికాప్టర్లో ప్రయాణించడం సురక్షితం కాదని పైలెట్లు సూచించటంతో ఆయన రోడ్డు మార్గంలో బయల్దేరి వెళ్లారు.