మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు. పులివెందుల పర్యటనలో ఉన్న ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో ఇవాళ జగన్ పాల్గొనాల్సిన కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం బుధవారం రోజున ఇడుపులపాయలో జరిగే ప్రార్థనల్లో వైఎస్ జగన్ పాల్గొనాల్సి ఉంది. అయితే అస్వస్థతకు గురికావటంతో ఈ కార్యక్రమంలో జగన్ పాల్గొనడం లేదు.