టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. బిహార్ సీఎం నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవి వదలి.. రాజ్యసభకు వెళ్లాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ చంద్రబాబు ఇలాగే చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. అలాగే చంద్రబాబు ఉప ప్రధాని అవుతారనే ప్రచారం కూడా జరుగుతోంది. దీనిపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.