గుంటూరు మార్కెట్ యార్డులో మిర్చి రైతులను వైసీపీ అధినేత వైఎస్ జగన్ బుధవారం పరామర్శించారు. అనంతరం మిర్చి రైతుల సమస్యలపై సుదీర్ఘ ట్వీట్ వేశారు. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అని చెప్పిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను మోసం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. రైతులు బాధపడితే రాష్ట్రానికి అరిష్టమని.. వెంటనే గుంటూరు మార్కెట్ యార్డు రైతులను చంద్రబాబు కలవాలని అన్నారు. మిర్చిని ప్రభుత్వమే కొనుగోలు చేసి వారికి బాసటగా నిలవాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.