మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబుకు అమ్ముడుపోయారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ కూటమికి మేలు చేసేందుకే ఆయన తన రాజ్యసభ సీటును అమ్మేసుకున్నారని జగన్ అన్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పైనా విమర్శలు గుప్పించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు కూటమి ప్రభుత్వంపై వైసీపీ నిరసన తెలుపుతుందని, జూన్ 4ను వెన్నుపోటు దినంగా నిర్వహిస్తామని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.