వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో హిందూపురం నియోజకవర్గానికి చెందిన నవీన్ నిశ్చల్, కొండూరు వేణుగోపాల్ రెడ్డిలను సస్పెండ్ చేశారు. మరోవైపు పలువురు జెడ్పీ ఛైర్మన్లు, ఛైర్ పర్సన్లు వైఎస్ జగన్ను కలిసి కృష్ణా జిల్లా జెడ్పీ ఛైర్పర్సన్ హారికపై దాడిని ఖండించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థలను బలోపేతం చేయాలని జగన్ సూచించారు.