ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ సీఏం జగన్ సంచలన ఆరోపణలు చేశారు. పల్నాడు జిల్లాలోని రెంటపాళ్లలో పర్యటించిన జగన్.. కమ్మ సామాజిక వర్గంపై చంద్రబాబు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నాగ మల్లేశ్వరరావును ఎందుకు చంపారని ప్రశ్నించారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వల్లభనేని వంశీ, కొడాలి నానిలను వేధిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. అయితే జగన్ పర్యటనలో ఆయన కాన్వాయ్ ఢీకొట్టి ఒక వ్యక్తి మృతి చెందడం విషాదం నింపింది.