Manickam Tagore On Ys Jagan Supports Nda Candidate:ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి వైఎస్సార్సీపీ మద్దతు తెలపడంపై కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ తీవ్ర విమర్శలు చేశారు. జగన్ సీబీఐ కేసులకు భయపడే ఎన్డీఏకు మద్దతు ఇచ్చారని ఆరోపించారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలకు విరుద్ధమని, వ్యక్తిగత ప్రయోజనాల కోసమే జగన్ ఇలా చేశారని ఆయన అన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ పార్లమెంటులో జరుగుతోంది, ఫలితాల కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.