Ys Sharmila Son Raja Reddy Political Entry: వైఎస్ షర్మిల తన కుమారుడు రాజారెడ్డితో కలిసి కర్నూలు ఉల్లి మార్కెట్కు వెళ్లడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. రాజారెడ్డి త్వరలోనే రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అమ్మమ్మ విజయమ్మ ఆశీర్వాదం తీసుకున్నాకే రాజారెడ్డి కర్నూలు వెళ్లడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది. షర్మిల మాత్రం ఈ విషయంపై ఇంకా స్పందించలేదు. అసలు రాజారెడ్డి రాజకీయ ఆరంగేట్రం ఉంటుందా?