జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన అంశంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. డీ లిమిటేషన్పై దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డీ లిమిటేషన్ ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు బీజేపీ ప్రతీకారానికి పాల్పడుతోందని షర్మిల ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాల్లో తన ప్రభావం తక్కువనే కారణంతోనే డీ లిమిటేషన్ ఆలోచన చేస్తోందన్నారు. డీ లిమిటేషన్ ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందన్న షర్మిల.. ఈ అంశం గురించి చంద్రబాబు తన వైఖరిని స్పష్టం చేయాలన్నారు.