YS Sharmila on YSR Statue issue Nandigama: నందిగామ సెంటర్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం తొలగింపుపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీపై కోపం ఉంటే వైఎస్సార్ విగ్రహం ఏం చేసిందని షర్మిల ప్రశ్నించారు. అసలు వైసీపీకి, వైఎస్ఆర్కు సంబంధం లేదన్న షర్మిల.. పార్టీకి పేరు పెట్టినంత మాత్రాన వైఎస్ఆర్పై వారిదే పేటెంట్ రైటా అంటూ ప్రశ్నించారు. వైఎస్ఆర్ విగ్రహాన్ని వెంటనే పునః ప్రతిష్టించాలని డిమాండ్ చేశారు.