YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు మరోసారి వార్తల్లో నిలిచింది. వివేకా హత్య కేసులో దోషులను కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయని సంచలన ఆరోపణలకు తెరతీశారు. జగన్ కోసమే అవినాష్ రెడ్డిని కాపాడుతున్నారని.. సీబీఐ నిజంగా అనుకుంటే.. ఎప్పుడో దోషులను గుర్తించి.. వారికి శిక్షలు విధించేలా చేసేదని ఆరోపించారు. ప్రధాని మోదీ చేతిలో సీబీఐ కీలుబొమ్మగా మారిందని.. జగన్ కోసమే మోదీ సీబీఐ దర్యాప్తును అడ్డుకున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకా హత్య కేసులో మళ్లీ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.