Ys Sharmila On Ys Jagan: వైఎస్సార్సీపీ సెక్యులర్ ముసుగులో మైనార్టీలను మోసం చేస్తోందని షర్మిల ఆరోపించారు. జగన్ బీజేపీకి దత్తపుత్రుడని, ముస్లిం వ్యతిరేక బిల్లులకు మద్దతు ఇవ్వడం దారుణమని అన్నారు. టీడీపీ, జనసేన బహిరంగంగా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే, జగన్ మాత్రం రహస్యంగా పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. మైనారిటీలకు కాంగ్రెస్ మాత్రమే రక్షణ కల్పిస్తుందని ఆమె స్పష్టం చేశారు. చంద్రబాబు, జగన్ ఇద్దరూ మైనారిటీల ద్రోహులేనని షర్మిల దుయ్యబట్టారు.