ఆంధ్రప్రదేశ్ డీజీపీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లేఖ రాసింది. తిరుమల కల్తీ నెయ్యి వివాదంపై సిట్ నివేదికను తప్పుదోవ పట్టిస్తూ. వైసీపీ పార్టీని, వైసీపీ నేతలపై దుష్ర్పచారం చేస్తూ రాష్ట్రంలో పలుచోట్ల ఫ్లెక్సీలు వెలిశాయని వైసీపీ ఆరోపించింది. ఈ ఫ్లెక్సీలు డిజైన్ చేసిన వారి దగ్గర నుంచి ఏర్పాటు చేసిన వారి వరకూ.. అందరిపైనా క్రిమినల్ కేసులు పెట్టాలంటూ ఏపీ డీజీపీకి వైసీపీ లేఖ రాసింది. ఈ ఫ్లెక్సీల ద్వారా తమ పార్టీకి, పార్టీ నేతలకు పరువు నష్టం కలిగించేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి లేఖ రాశారు.