వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల జరిగిన వైసీపీ సమావేశంలో రప్పా రప్పా అంటూ మొండితోక అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ నేపథ్యంలో మొండితోక అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కంచికచర్ల పోలీసులు మొండితోక అరుణ్ కుమార్ మీద కేసు నమోదు చేశారు.