YSRCP: వైసీపీ ఎంపీలకు ఆ పార్టీ చీఫ్ వైఎస్ జగన్ కీలక సూచనలు చేశారు. పార్లమెంటు సమావేశాల్లో ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, ఇతర వాటిపై పార్లమెంటులో రాజీ పడకుండా గట్టిగా గళమెత్తాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర సమస్యలపై పార్లమెంటులో పోరాడాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని టీడీపీ ఎంపీలు వ్యతిరేకించకపోవడం దారుణమని.. రాష్ట్రాన్ని కాపాడాలని ఎంపీలకు హితవు పలికారు.