వైసీపీ ఎమ్మెల్యే ఒకరు పార్టీని వీడి, జనసేన లేదా బీజేపీలో చేరతారంటూ గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి వైసీపీని వీడతారంటూ ఇటీవల ప్రచారం జరుగుతోంది. ఆయన జనసేన లేదా బీజేపీలో చేరే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చాయి. బాలనాగిరెడ్డి వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటుండటంతో ఈ వార్తలకు బలం చేకూరింది. అయితే పార్టీ మార్పు వార్తలపై మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ వార్తలపై స్పందించారు.