మాజీ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అనారోగ్యానికి గురయ్యారు. బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్లు సమాచారం. దీంతో కుటుంబసభ్యులు వెంటనే హైదరాబాద్ తరలించారు. హైదరాబాద్లోని సిటీ న్యూరో ఆస్పత్రిలో బొత్సకు చికిత్స కొనసాగుతోంది. అయితే బొత్స ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మైల్డ్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆస్ప్రతిలో చికిత్స కొనసాగుతోంది.