Vidadala Rajini Ysrcp Digital Book Complaint: వైఎస్సార్సీపీ కొత్తగా తెచ్చిన 'డిజిటల్ బుక్' యాప్లో మాజీ మంత్రి విడదల రజినిపై ఫిర్యాదు కలకలం రేపింది. నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం, రజిని తన ఇల్లు, కారుపై దాడి చేయించారని ఆరోపిస్తూ, జగన్కు న్యాయం చేయాలని కోరారు. కార్యకర్తలకు న్యాయం చేస్తామని జగన్ చెప్పిన ఈ యాప్లో, సొంత పార్టీ మాజీ మంత్రి రజిని పైనే ఫిర్యాదు రావడం విశేషం.