వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మార్చి నెలలో కురిసిన అకాల వర్షాలతో వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో అరటి రైతులు భారీగా నష్టపోయారు. ఈ క్రమంలో వారిని పరామర్శించిన వైఎస్ జగన్ .. ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇక ఇచ్చిన మాట ప్రకారం 670 మంది రైతులకు రూ.20 వేలు చొప్పున రూ.1.14 కోట్లు ఆర్థిక సాయం అందించారు. ఈ విషయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించింది.