వైసీపీ సీనియర్ నేత ముద్రగడ అనారోగ్యానికి గురైనట్లు తెలిసింది. ప్రొస్టేట్ క్యాన్సర్తో బాధపడుతున్న ముద్రగడ పద్మనాభం రెడ్డిని.. షుగర్ లెవెల్స్ పడిపోవడంతో హైదరాబాద్ తరలిస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఆయన కుమార్తె క్రాంతి, ముద్రగడకు సరైన వైద్యం అందడం లేదని ఆరోపించగా, ఆయన ఖండించారు. గతంలో కాపు ఉద్యమంతో వార్తల్లో నిలిచిన ముద్రగడ, ఎన్నికల ముందు వైసీపీలో చేరి పవన్ కళ్యాణ్ పై సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.