ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పల్నాడు జిల్లా పర్యటనలో అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. ఏటుకూరు బైపాస్ వద్ద జగన్ కాన్వాయి ముందు ఉన్న ఓ ప్రైవేట్ వాహనం ఢీకొట్టి సింగయ్య అనే వృద్ధుడు చనిపోయాడు. అటు సత్తెనపల్లిలో మరో వైసీపీ కార్యకర్త చనిపోయినట్లు తెలిసింది. సత్తెనపల్లి క్లాక్ టవర్ వద్ద ఊపిరాడక ఓ వైసీపీ కార్యకర్త సొమ్మసిల్లి పడిపోగా.. చుట్టుపక్కల వారు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించినట్లు సమాచారం. మరోవైపు ఈ ఘటనపై టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది.