ఏపీలో మళ్లీ వైసీపీ అధికారంలోకి వచ్చి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి సీఎం అయితే అమరావతి పరిస్థితి ఏమిటి.. రాజధానిగా విశాఖ ఉంటుందా, అమరావతి కొనసాగుతుందా.. 2019లో చెప్పిన ప్రకారం మూడు రాజధానులవైపు మొగ్గు చూపుతారా.. సోలో రాజధాని సో బెటర్ అంటారా.. ఇవి అనేక మంది మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలు. ఈ నేపథ్యంలో వైసీపీలో కీలక నేతగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి దీనికి క్లారిటీ ఇచ్చారు. విజయవాడలో శుక్రవారం రోజున జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సజ్జల రామకృష్ణారెడ్డి దీనిపై క్లారిటీ ఇచ్చారు.