Ysrcp Loosed Bobbili Markapur Municipalities: ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. విజయనగరం జిల్లా బొబ్బిలి, ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపాలిటీల్లో ఛైర్మన్లపై అవిశ్వాస తీర్మానాలు నెగ్గాయి. బొబ్బిలి వైస్ ఛైర్మన్ రమాదేవిపై అవిశ్వాసానికి 22 మంది కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. మార్కాపురం ఛైర్మన్ బాలమురళీకృష్ణారావుకు వ్యతిరేకంగా 19 మంది ఓటు వేశారు. దీంతో ఇద్దరూ తమ పదవులు కోల్పోయారు. ఈ పరిణామాలు అధికార పార్టీకి రాజకీయంగా నష్టం చేకూర్చే విధంగా ఉన్నాయి.