Ysrcp Loosed Kondapalli Municipality: ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీలో టీడీపీ జెండా ఎగిరింది. ఉత్కంఠభరిత పరిస్థితుల మధ్య హైకోర్టు ఆదేశాలతో ఫలితాలు వెల్లడించారు. టీడీపీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కైవసం చేసుకుంది. మొత్తం వార్డుల్లో ఇరు పార్టీలకు సమానంగా స్థానాలు రావడంతో ఉత్కంఠ నెలకొంది. చివరకు ఇండిపెండెంట్ అభ్యర్థి మద్దతుతో టీడీపీ విజయం సాధించింది.