Ysrcp Loosed Kadiri Bobbili Municipality: ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కదిరి మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది, దిల్షా దున్నీషా ఛైర్పర్సన్గా ఎన్నికయ్యారు. బొబ్బిలి మున్సిపల్ ఛైర్మన్గా టీడీపీకి చెందిన శరత్బాబు గెలుపొందారు. తిరువూరు నగర పంచాయతీ ఛైర్మన్ ఎన్నిక కోరం లేక వాయిదా పడింది. శ్రీ సత్యసాయిజిల్లా రామగిరి ఎంపీపీ ఎన్నిక కూడా వాయిదా పడింది, విశాఖపట్నం డిప్యూటీ మేయర్ ఎన్నిక సైతం వాయిదా పడింది.