తెలంగాణలోని అంగన్వాడీ కేంద్రాల ఆధునికీకరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సొంత భవనాలు లేని 23,982 కేంద్రాలకు కొత్తవి నిర్మించనున్నారు. ఆరేళ్లలోపు పిల్లలకు నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. ఇక అంగన్వాడీ టీచర్లకు 5జీ ట్యాబ్లు ఇవ్వనున్నారు. ఈ మేరకు 2025-26 కార్యాచరణ ప్రణాళికను శిశు సంక్షేమ శాఖ ప్రకటించింది.