తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. సమావేశాల్లో భాగంగా.. నేడు సభలో ప్రశ్నోత్తరాలు నిర్వహించగా.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మట్లాడారు. ఈ సందర్భంగా.. సహచర ఎమ్మెల్యేలపై దానం నాగేందర్ సీరియస్ అయ్యారు. సభలో అందరికంటే సీనియర్ ఎమ్మెల్యే తానేనని.. ఏ మాట్లాడాలని తనకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదని దానం నాగేందర్ అసహనం వ్యక్తం చేశారు. కాగా.. దానం వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.