బీఆర్ఎస్ పార్టీ నుంచి కల్వకుంట్ల కవితను ఎందుకు సస్పెండ్ చేశారు అనేదానిపై ఆ పార్టీ మహిళా నేతలు మీడియా ముందు క్లారిటీ ఇచ్చారు. గత కొన్నిరోజులుగా కల్వకుంట్ల కవిత చేస్తున్న విమర్శలు, అనుసరిస్తున్న వ్యతిరేక వైఖరి.. పార్టీకి, పార్టీలోని కోట్లాది మంది కార్యకర్తలకు నష్టం చేకూరుస్తోందని భావించిన కేసీఆర్.. కవితను సస్పెండ్ చేశారని తేల్చి చెప్పారు. కేసీఆర్కు పేగు బంధం కంటే.. పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని వెల్లడించారు. కవిత కొత్తగా పార్టీ పెట్టినా బీఆర్ఎస్కు వచ్చే నష్టమేమీ లేదని స్పష్టం చేశారు.