రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దీక్షిత్కు న్యాయస్థానం అండగా నిలిచింది. జాతీయ లోక్ అదాలత్లో న్యాయమూర్తి షౌకత్ జహాన్ సిద్ధిఖీ అంబులెన్స్ వద్దకే వెళ్లి బాధితుడి పరిస్థితిని తెలుసుకున్నారు. వెంటనే స్పందించి బాధితుడికి రూ.కోటి పరిహారం చెల్లించాలని బీమా సంస్థను ఆదేశించారు. న్యాయమూర్తి మానవత్వం చాటుకోవడంతో దీక్షిత్ కుటుంబానికి ఊరట లభించింది.