దళిత వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. రేపటి (ఏప్రిల్ 14) నుంచి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రానుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. ఎస్సీ వర్గీకరణ చట్టానికి తుది రూపం ఇచ్చినట్లు ఆయన తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి రోజున ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు ప్రకటించారు.