వరంగల్ జిల్లాలోని మామునూరు లో విమానాశ్రయం అభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. భూ సేకరణ, రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు మరింత వేగవంతం అవుతున్న నేపథ్యంలో.. అక్కడ భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఒకప్పుడు గజం రూ.10 వేల వరకు ఉండగా.. అది రూ.22 వేల వరకు పెరిగాయి. వరంగల్ నుంచి ఖమ్మం వెళ్లే ప్రాంతంలో ఎకరం భూమి దాదాపు రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల మధ్య పలుకుతుండటం గమనార్హం.